- ప్రభుత్వానికి ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా సలహా
న్యూఢిల్లీ: డిపాజిట్లపై పొందే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ తగ్గించాలని స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రజల సేవింగ్స్ పెరుగుతాయని, ఫలితంగా బ్యాంకుల దగ్గర డిపాజిట్లు పెరుగుతాయని అన్నారు. లాంగ్ టెర్మ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లకు ఫండింగ్ ఇవ్వడం బ్యాంకులకు మరింత ఈజీ అవుతుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి అన్ని బ్యాంకు బ్రాంచుల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.40 వేలు దాటితే ట్యాక్స్ కట్ అవుతోంది. సేవింగ్స్ అకౌంట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.10 వేల పైన ఉంటే ట్యాక్స్ పడుతోంది.
కుదిరితే వడ్డీ ఆదాయాలపై ట్యాక్స్ రిలీఫ్ను బడ్జెట్లో ప్రకటించాలి. డిపాజిటర్లకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఫలితంగా బ్యాంకింగ్ సెక్టార్ ఈ డిపాజిట్లను దేశం కోసం ఉపయోగించడానికి వీలుంటుంది’ అని ఖారా వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే నెల ప్రభుత్వం ప్రవేశ
పెట్టనుంది.