మరో 600 బ్రాంచ్​లను తెరుస్తం

మరో 600 బ్రాంచ్​లను తెరుస్తం
  • ఎస్​బీఐ చైర్మన్ శ్రీనివాసులు ​శెట్టి 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) యోచిస్తోంది. పెద్ద నివాస టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు.

   ఈ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ప్రారంభించింది.  ఎస్​బీఐ నెట్​వర్క్​ మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 బ్రాంచులకు చేరింది. ఈ బ్యాంకుకు 65 వేల ఏటీఎంలు, 85 వేల మంది బిజినెస్ ​ కరస్పాండెంట్లు ఉన్నారు.

 తాము  సుమారు 50 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నామని, ఎస్​బీఐని అత్యుత్తమ బ్యాంకుగా మార్చడం తన ప్రయత్నమని శెట్టి అన్నారు.   డిపాజిటర్ల కోసం రికరింగ్ డిపాజిట్, సిప్ కాంబో ఉత్పత్తితో సహా వినూత్న ఉత్పత్తులతో ముందుకు రావాలని ఆలోచిస్తున్నామని వివరించారు.