
- వర్గీకరణ బిల్లుల ప్రతులను చించేసి నిరసన తెలిపిన మాల సంఘాల నాయకులు
ఖైరతాబాద్, వెలుగు: మందకృష్ణ మాదిగను సంతృప్తి పరచడానికే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించారని మాల సంఘాల ప్రనిధులు ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సౌత్ఇండియా సమతా సైనిక్దళ్ అధ్యక్షుడు మార్షల్దిగంబర్కాంబ్లీ, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. షమీమ్అక్తర్కమిషన్ నివేదిక తప్పుల తడక అన్నారు.
కాంగ్రెస్పార్టీని గెలిపించిన మాలలను విస్మరించి, బీజేపీకి ఓటు వేయండని పిలుపునిచ్చిన మందకృష్ణను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదించిందన్నారు. ఈ బిల్లును సుప్రీం కోర్టు కొట్టేయడం ఖాయమన్నారు. మాలలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కూలుస్తామనిహెచ్చరించారు. మాలలను రాజకీయంగా అణిచి వేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. వర్గీకరణ బిల్లు పత్రాలను చించివేశారు.