
- మాల మహానాడు సోషల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాల్వ నరేశ్
దుబ్బాక, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు సోషల్మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాల్వ నరేశ్ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం దుబ్బాక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించడం మాలలకు చీకటి రోజు అన్నారు.
జస్టిస్ షమీమ్అక్తర్ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని, 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని చేయడం మాలలను మోసగించడమేనని ఆరోపించారు. కమిషన్సూచించిన రోస్టర్ పాయింట్లలోనూ మాలలకు విద్యా, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
మాల, మాదిగలను రాజకీయ లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మాలల సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. సంఘం నేతలు కాల్వ లింగం, ఆస స్వామి, ఆస చిన్న ముత్యం, తునికి సురేశ్, మండల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.