రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా

రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా

సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం వెలుగుచూసింది. తహసిల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి.. 14 రోజులు రిమాండ్ తరలించారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దార్ గా పనిచేస్తున్న జయశ్రీ గతంలో హుజూర్నగర్ తాసిల్దార్ గా పని చేశారు. ఆమె, ధరణి ఆపరేటర్ జగదీష్ తో కలిసి రైతుబంధు నిధులు కొట్టేసింది. వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లోకి తీసుకున్నారు. హుజూర్నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు నిధులు కాజేశారు.

ALSO READ | హైదరాబాద్‌లో టీ పౌడర్ కల్తీ.. స్పాట్‌లో 200కిలోల కొబ్బరి చిప్పల పొడి

మొత్తం రూ.14,63,004 రైతుబంధు నిధులు తహసిల్దార్, ధరణి ఆపరేటర్ కలిసి దారి మళ్లించారు. తహసిల్దార్ జయశ్రీ ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసింది. తహసిల్దార్, పట్టాదారులు రైతుబంధు డబ్బులను సగం సగం పంచుకున్నారు.