ఫెయిలైన విద్యార్థులు అలర్ట్: జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

ఫెయిలైన విద్యార్థులు అలర్ట్: జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

టెన్త్ అడ్వాన్స్ డ్  సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 ,2025 నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది  ప్రభుత్వం.  ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు  మే 16 వరకు చెల్లించాలి. ఆన్ లైన్ లో చెల్లించడానికి మే 17 లాస్ట్ డేట్.

రీకౌంటింగ్ కు ఒక్కో సబ్జెక్ట్ కు రూ.500 ఫీజును నిర్ణయించింది. రీ వెరిఫికేషన్ కు ఒక్కో సబ్జెక్ట్ కు రూ. 1000గా నిర్ణయించింది ప్రబుత్వం. ఇక రీ కౌంటింగ్ కు ,రీ వెరిఫికేషన్  కోసం ఎదురుచూడకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.

 మొత్తం పదో తరగతి పరీక్షలో   92.78 ఉత్తీర్ణత  సాధించారు.  బాలురు ఉత్తీర్ణత  91.32సాధించగా,  బాలికలు  94.26 శాతం సాధించారు.  బాలికల కంటే బాలురు 2.64 అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

►ALSO READ | Telangana SSC Result 2025: టెన్త్ రిజల్ట్ రిలీజ్.. మహబూబాబాద్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ జిల్లా లాస్ట్