![పిక్నిక్ కి వెళ్లిన ఆరేళ్ళ బాలికపై స్కూల్ బస్సు డ్రైవర్ లైంగిక దాడి..](https://static.v6velugu.com/uploads/2025/02/school-bus-driver-attacked-six-years-old-girl-at-shamshabad_XWA9v1wQLj.jpg)
పిక్నిక్ కి వెళ్లిన ఆరేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు స్కూల్ బస్సు డ్రైవర్. శంషాబాద్ లో చోటు చేసుకుంది ఈ దారుణం.. ఫిబ్రవరి 4న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మంగళవారం ( ఫిబ్రవరి 4 ) శంషాబాద్ కి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో రంగా రెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘట్ గ్రామంలో ని సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకు వున్నారు. అదే సమయంలో స్కూల్ బస్సు డ్రైవర్ 1వ తరగతి చదువుతున్న ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి దండ్రులు ఆలస్యంగా శంషాబాద్ పోలీసుల సహాయంతో ఈ రోజు మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధీంతో నిందితుడిపై పొక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మంచాల పోలీసులు. పిల్లలను జాగ్రత్తగా స్కూల్ కి చేర్చాల్సిన డ్రైవరే ఈ దారుణానికి పాల్పడితే ఎలా అంటూ వాపోతున్నారు చిన్నారి తల్లిదండ్రులు. కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు తల్లదండ్రులు.