
- ఒక్కో తప్పుకు 10 దెబ్బలు కొట్టిన టీచర్
- మూడో తరగతి స్టూడెంట్కు గాయాలు
మియాపూర్, వెలుగు: లెక్కల్లో తప్పు చేశాడని మదీనాగూడ గవర్నమెంట్స్కూల్టీచర్ మూడో తరగతి స్టూడెంట్ను చితకబాదాడు. వాతలు పడేలా కొట్టాడు. సదరు టీచర్పై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి మియాపూర్పీఎస్లో ఫిర్యాదు చేశాడు. మదీనాగూడకు చెందిన దేవిప్రసాద్ స్థానిక గవర్నమెంట్స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం స్కూలుకు వెళ్లాడు.
అయితే లెక్కలు తప్పుగా చేశాడని టీచర్గోవర్థన్ బాలుడిని చితకబాదాడు. ఒక్కో తప్పుకు దెబ్బలు అంటూ కర్రతో ముఖం, శరీరం కమిలిపోయేలా కొట్టాడు. గాయాలతో ఇంటికి వచ్చిన దేవిప్రసాద్ను చూసిన తండ్రి శివ మియాపూర్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలాగే ముక్కుపై గుద్దడంతో బ్లడ్వచ్చిందని, హెచ్ఎంకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.