![చార్జింగ్ చేసుకొని బ్యాటరీ తినొచ్చు.. ఇటలీ సైంటిస్టుల సరికొత్త ఆవిష్కరణ..](https://static.v6velugu.com/uploads/2023/04/rechargeable-battery_pDKhjFBHui.jpg)
- చార్జింగ్ చేసుకొని బ్యాటరీ తినొచ్చు
- ఇటలీ సైంటిస్టుల సరికొత్త ఆవిష్కరణ..
- ఫుడ్ క్వాలిటీని తెలుసుకునే అవకాశం
న్యూఢిల్లీ : ఇటలీ సైంటిస్టులు సరికొత్త రీచార్జెబుల్ బ్యాటరీని తయారు చేశారు. దీంతో మనం చిన్నపాటి ఎల్ఈడీ బల్బును వెలిగించొచ్చు. బ్యాటరీలో చార్జింగ్ అయిపోయాక ఎంచక్కా తినేయొచ్చు కూడా.. ఎందుకంటే సైంటిస్టులు ఆ రీచార్జెబుల్ బ్యాటరీని మనం రోజూ తినే ఫుడ్ ఐటెమ్స్ తో తయారు చేశారు. దీనికి ‘‘ఎడిబుల్ అండ్ రీచార్జెబుల్ బ్యాటరీ”అని పేరు పెట్టారు. దీని సాయంతో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా చార్జ్ చేసుకోవచ్చు. రీచార్జెబుల్ బ్యాటరీని తినేసినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అంటున్నారు.
దీన్ని బాదం, కేపర్స్, ఆల్గే, ఫుడ్ సప్లిమెంట్స్ వంటి ఐటెమ్స్తో తయారు చేశారు. ఇదొక ప్రొటోటైప్ బ్యాటరీ. ఇందులో 0.65 వోల్ట్స్ కరెంట్ ఉంటుంది. లేదంటే 12 నిమిషాల దాకా 48 మైక్రోయాంపియర్ బల్బు వెలిగించొచ్చు. ప్రపంచంలోని మొట్టమొదటి ఎడిబుల్ రీచార్జెబుల్ బ్యాటరీ ఇదే అని, ఆరోగ్య సంబంధమైన విశ్లేషణలు చేయడానికి తోడ్పడుతుందని ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ సైంటిస్ట్గా పని చేస్తున్న మారియో కైరోనీ తెలిపారు. ఆహార నాణ్యతను కూడా ఇది తెలియజేస్తుందన్నారు.
ఐస్క్రీమ్ లాంటి ఆకారం
ఈ బ్యాటరీ చూసేందుకు ఐస్క్రీమ్లానే ఉంటుంది. బాడీలో ఉపయోగించే చిన్న చిన్న మెడికల్ ఎలక్ట్రానిక్ డివైజ్లను కూడా చార్జ్ చేయగలదు. తినగలిగే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, సెన్సార్లనూ తాము తయారు చేస్తున్నామని కైరోనీ వివరించారు.