
అధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. ఐఆర్ సీటీసీ సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడుపుతున్న సంగతి తెలిసిందే. మే 18న మరో కొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. వైష్ణోదేవి ఆలయంతో పాటు హరిద్వార్, రిషికేష్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 10న ప్రారంభం కానున్న ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ.
జూన్ 10వ తేది అర్థరాత్రి 12.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరుతోంది. యాత్రకు వెళ్లేవారు కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, వార్ధా, నాగ్పూర్ రైల్వే స్టేషన్లలో కూడా ఈ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఈ యాత్ర కవర్ చేస్తోంది. అయితే కటారా నుండి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం IRCTC వెబ్సైట్ను సందర్శించవచ్చు: http://www.irctctourism.com
లేదా 9701360701 లేదా 8287932228 లేదా 9110712752 నంబర్లను సంప్రదించండి
హరిద్వార్ ,రిషికేష్తో మాతా వైష్ణోదేవి – భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు:
- సికింద్రాబాద్ - ఆగ్రా - మధుర - బృందావన్ - కత్రా (వైష్ణోదేవి) - హరిద్వార్ - రిషికేశ్ - సికింద్రాబాద్.
- జూన్ 10 అర్థరాత్రి 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం
- 8 రాత్రులు/9 రోజులు (జూన్ 10 నుండి 18 వరకు)
- బోర్డింగ్ / డి బోర్డింగ్ స్టేషన్లు - సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పుర్కాగజ్ నగర్, బల్హర్షా, వార్ధా , నాగ్పూర్.
యాత్ర ప్యాకేజీ ఒక్కొక్కరికి (GSTతో సహా):
- ఎకానమీ కేటగిరీ (SL): రూ. 15,435.
- స్టాండర్డ్ కేటగిరీ (3AC): రూ. 24,735.
- కంఫర్ట్ కేటగిరీ (2AC): రూ. 32,480.