యువకుడి కంటిలో దిగిన స్క్రూడ్రైవర్.. ఆపరేషన్​ ద్వారా తొలగించిన గాంధీ హాస్పిటల్​ డాక్టర్లు

యువకుడి కంటిలో దిగిన స్క్రూడ్రైవర్.. ఆపరేషన్​ ద్వారా తొలగించిన గాంధీ హాస్పిటల్​ డాక్టర్లు

పద్మారావునగర్, వెలుగు: ప్రమాదవశాత్తు ఓ యువకుడి కంటిలో దిగిన స్క్రూడ్రైవర్‌‌‌‌ను సికింద్రాబాద్‌‌‌‌ గాంధీ హాస్పిటల్​వైద్యులు ఆపరేషన్​చేసి, తొలగించారు. వారి వివరాల ప్రకారం.. మెదక్‌‌‌‌ జిల్లా మనోహరాబాద్‌‌‌‌ మండలం కూచారం గ్రామానికి చెందిన రంజిత్‌‌‌‌ ఎలక్ట్రికల్‌‌‌‌ మెకానిక్‌‌‌‌ గా చేస్తున్నాడు. ఈ నెల 8న రిపేరింగ్​పనులు చేస్తుండగా స్క్రూడ్రైవర్‌‌‌‌ కుడి కంటిలో బలంగా దిగింది. 

కుటుంబసభ్యులు అతన్ని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్​కంటి దవాఖానలో అడ్మిట్‌‌‌‌ చేశారు. వైద్యుల సూచన మేరకు మరుసటిరోజు నిమ్స్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు 10వ తేదీన గాంధీ హాస్పిటల్​కు రిఫర్‌‌‌‌ చేశారు. గాంధీ వైద్యులు టెస్ట్​చేసి, కంటికి ఎటువంటి గాయం కాలేదని, పైభాగంలో గుచ్చుకుందని నిర్ధారించారు.  న్యూరోసర్జరీ విభాగానికి తరలించి, సుమారు 2 గంటలపాటు శ్రమించి, స్క్రూడైవర్‌‌‌‌ను సక్సెస్​ఫుల్​గా తొలగించారు. రంజిత్‌‌‌‌ కోలుకుంటున్నాడని, త్వరలోనే డిశ్చార్జ్​చేస్తామని హాస్పిటల్​అధికారులు మంగళవారం తెలిపారు.