మహేష్-రాజమౌళి సినిమాపై క్రేజీ అప్డేట్..

మహేష్-రాజమౌళి సినిమాపై క్రేజీ అప్డేట్..

ఆర్.ఆర్. ఆర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్. ఎస్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో కలసి ఎస్ఎస్ఎంబీ29 చిత్రంపై పని చేస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు.  అయితే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్ళడం లేదు. 

దీంతో రిలీజ్ ఎప్పుడుంటుందనే విషయం అటుంచితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై కూడా అప్డేట్ లేదు.  దీంతో మహేష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఇటీవలే మహేష్ అభిమానులకి ప్రముఖ స్క్రిప్ట్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు.

పూర్తివివరాల్లోకి వెళితే   స్క్రిప్ట్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే ఓ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వెళ్లారు. దీంతో ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో కొంతమంది మహేష్ ఫ్యాన్స్ ఎస్ఎస్ఎంబీ29 గురించి అప్డేట్ ఇవ్వాలని అడిగారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఎస్ఎస్ఎంబీ29 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది  జనవరిలో మొదలు కానుందని తెలియజేశారు. 

ALSO READ | వేట్టయన్ కచ్చితంగా మీకు నచ్చుతుంది: రాణా దగ్గుబాటి

దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ మరికొందరు మాత్రం ఎస్ఎస్ఎంబీ29 సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభమైతే పూర్తవ్వడానికి సుమారు సంవత్సరం పడుతుందని దీంతో 2026 వరకూ మహేష్ సినిమాలు ఉండవని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో మహేష్ బాబు రాజమౌళి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రమిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం మహేష్ లుక్స్ పూర్తిగా మార్చుకుని కొత్త గెటప్ లో కనిపించనున్నాడు.