
- స్క్రూటినీలో ఒకనామినేషన్ తిరస్కరణ
- జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: మెదక్పార్లమెంట్ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్రాహుల్రాజ్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్త్కోటి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో స్క్రూటినీ నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో 54 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఒక్క నామినేషన్తిరస్కరణకు గురి కాగా 53 అభ్యర్థుల నామినేషన్ ఆమోదించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సంగారెడ్డికి చెందిన కళ్లు నర్సింలు గౌడ్నామినేషన్ తిరస్కరణ గురైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్తెలిపారు.
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
మెదక్ పార్లమెంట్ఎన్నికలకు సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తియిందని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్తెలిపారు. శుక్రవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటీ, సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి , అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీవోలను మొత్తం 3,540 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అలాట్ చేసినట్లు వివరించారు. ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పార్లమెంట్ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, సలహాల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చని సూచించారు.