మామునూర్​లో స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు

మామునూర్​లో స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు

ఖిలావరంగల్ (కరీమాబాద్), వెలుగు: మామునూర్ నాల్గో బెటాలియన్ లో ఎస్సీటీపీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024 ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ రాంప్రకాశ్​హాజరై క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

 అనంతరం గెలిపొందిన వారికి మెడల్స్, మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ పూజ, అసిస్టెంట్ కమాండెంట్లు కృష్ణ ప్రసాద్, వీరన్న, భిక్షపతి, రిజర్వ్ ఇన్​స్పెక్టర్​శోభన్, రవి, పురుషోత్తం రెడ్డి, సర్వర్, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ పాల్గొన్నారు.