
- గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో సెర్చ్
లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నేరల్ తండా, చద్మల్ తండా, బీర్మల్ తండా, కొత్తబాది తండా, గుజ్జుల్తండా, సోమారం తండా, గొల్లాడి తండా శివార్లలోని మొక్కజొన్న పంటలను, ఫారెస్టు భూములను శుక్రవారం పోలీస్, ఎక్సైజ్ శాఖలకు చెందిన వంద మంది సిబ్బంది తనిఖీలు చేశారు. గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాకీర్ఆధ్వర్యంలో ఇరు శాఖల సిబ్బంది మొక్కజొన్న పంటలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఫారెస్టు భూముల్లో మొక్కజొన్న తోటల్లో కొంతమంది గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిషేధిత గంజాయిను ఎవరు సాగుచేసినా వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేస్తామన్నారు. తనిఖీల్లో ఎల్లారెడ్డి, సదాశివనగర్ సీఐలు రవీందర్నాయక్, సంతోష్, ఎస్ఐలు ఆంజనేయులు,రంజిత్, ఎక్సైజ్ సీఐ షాకీర్, ఎస్ఐ గంగాధర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.