
న్యూఢిల్లీ:మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి తీసుకొని యూనిట్లు ఇచ్చిన నెల రోజుల్లోపు కచ్చితంగా న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ) ను ప్రారంబించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఓ ఫండ్ ప్రారంభానికి తుది గడువు అంటూ ఏదీ లేదు. ఈ కొత్త విధానం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది.
ఎంఎఫ్లు అవసరమైనంత డబ్బును మాత్రమే సేకరించేలా చూడటానికి, నిధుల దుర్వినియోగం ఆపడానికే ఈ ప్రయత్నమని సెబీ తెలిపింది. నిధులను ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తారో స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్(ఎస్ఐడీ)లోనే తెలియజేయాలని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను సెబీ ఆదేశించింది.