4 ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్

4 ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్
  • ఇష్యూలకు రెడ్​సిగ్నల్..  రూల్స్​ ప్రకారం లేకపోవడం వల్లే

న్యూఢిల్లీ: ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా నాలుగు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపిఓ)కు సెబీ అనుమతి ఇచ్చింది.   ఎకోస్ ఇండియా మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్,  కేఆర్​ఎన్​ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ కూడా రెగ్యులేటర్ క్లియరెన్స్ పొందాయి. ఈ ఏడాది  మార్చి– ఏప్రిల్ మధ్య ఇవి తమ ఐపీఓ డాక్యుమెంట్లను సెబీకి అందజేశాయి. ఈ నాలుగు కంపెనీలు జూలై 22-–26 మధ్య సెబీ అబ్జర్వేషన్​ లెటర్లను పొందాయి.

ఈ లెటర్​వచ్చిందంటే ఐపీఓకు గ్రీన్​సిగ్నల్​ ఉన్నట్టుగానే భావించాలి.  డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ) ప్రకారం, సోలార్ సెల్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓతో రూ. 1,500 కోట్లను సమీకరిస్తుంది.  ఇందులో తాజా ఇష్యూతోపాటు  ప్రమోటర్ ద్వారా 2.82 కోట్ల షేర్ల వరకు ఓఎఫ్​ఎస్​ ఉంటుంది.  తాజా ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుబంధ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టడానికి, ఇతర అవసరాలకు వాడతారు.   జ్యువెలరీ రిటైల్ చైన్ పీఎన్​ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్  ఐపీఓతో రూ. 1,100-కోట్లను సేకరించనుంది.

ఫ్రెష్​ ఇష్యూతో రూ.850 కోట్లు సంపాదించనుంది. ప్రమోటర్ ఎస్​వీజీ బిజినెస్ ట్రస్ట్ నుంచి రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఓఎఫ్​ఎస్​ద్వారా అమ్మకానికి వస్తాయి.   ఐపీఓ ద్వారా వచ్చిన రూ.850 కోట్లలో మొత్తం రూ.387 కోట్ల నిధులను మహారాష్ట్రలో 12 కొత్త స్టోర్ల ఏర్పాటుకు, రూ.300 కోట్లను అప్పుల చెల్లింపులకు, కొంత భాగాన్ని సాధారణ అవసరాలకు కూడా వినియోగిస్తారు.

   డ్రైవర్- ఆధారిత మొబిలిటీ ప్రొవైడర్ ఎకోస్ (ఇండియా) మొబిలిటీ అండ్​ హాస్పిటాలిటీ లిమిటెడ్  పబ్లిక్ ఇష్యూ పూర్తిగా 1.8 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్​ఎస్ ఇష్యూ. తాజా ఇష్యూ ఉండదు.   కేఆర్​ఎన్​ హీట్ ఎక్స్ఛేంజర్ ఐపీఓలో ఓఎఫ్​ఎస్​ కాంపోనెంట్ ఉందు. ఫ్రెష్​ఇష్యూతో 1.6 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ అవుతాయి.    రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అల్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నీమ్రానాలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కేఆర్​ఎన్​ హెచ్​వీఏసీలో పెట్టుబడి కోసం నిధులను వాడతారు. ఈ నాలుగు కంపెనీలూ బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ,  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో లిస్ట్ అవుతాయి.  

ఈ కంపెనీల ఇష్యూలకు నో

సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్,  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా నాలుగు సంస్థల ఐపీఓ డ్రాఫ్ట్ పత్రాలను సెబీ వెనక్కి పంపింది. ప్రైవేట్​ ఈక్విటీ కంపెనీ టీపీజీ క్యాపిటల్ -మద్దతు గల సాయి లైఫ్ సైన్సెస్, బీఎండబ్ల్యూ వెంచర్స్  ఆఫర్ డాక్యుమెంట్లను కూడా తిరిగి ఇచ్చింది. ఈ కంపెనీల ఐపీఓ డాక్యుమెంట్లు జులై 1న సెబీకి అందాయి.

జులై 24, 2024 నాటికి సెబీ ఐసీడీఆర్ రెగ్యులేషన్స్, 2018  రెగ్యులేషన్ 7(1) (ఎ)కి అనుగుణంగా లేనందున డాక్యుమెంట్లను తిరిగి పంపించామని సెబీ తెలిపింది. ఈ రూల్స్​ ప్రకారం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసేవారు సెక్యూరిటీల లిస్టింగ్ కోసం సూత్రప్రాయంగా ఆమోదం పొందేందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దరఖాస్తు చేయాలి. రెండింట్లో ఒక దానిని ఎంచుకోవాలి.