
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు లావాదేవీల గురించి, సర్వీసుల గురించి వివరించడానికి 1600 సిరీస్ ఫోన్నంబర్లనే వాడాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రిజిస్టర్డ్, రెగ్యులేటెడ్ సంస్థలకు స్పష్టం చేసింది. ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెంబర్ వాడటం వల్ల ఇన్వెస్టర్లకు భద్రత ఉంటుందని, మోసాలు తగ్గుతాయని పేర్కొంది.
ఏవైనా నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వస్తే రిపోర్ట్ చేయాలని ఇన్వెస్టర్లకు సూచించింది. సంబంధిత టెలికం ఆపరేటర్ డూ నాట్డిస్టర్బ్ కంప్లెయింట్ విధానం ద్వారా లేదా క్రైమ్ హెల్ప్లైన్ నంబరు 1930కి ఫిర్యాదు చేయవచ్చని సెబీ సూచించింది.