![బ్రైట్కామ్ గ్రూపునకు రూ.34 కోట్ల ఫైన్](https://static.v6velugu.com/uploads/2025/02/sebi-slaps-rs-34-cr-fine-on-brightcom-group-promoters-for-misrepresenting-financials_digwHJm5zS.jpg)
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అక్రమంగా మార్చినందుకు హైదరాబాద్కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసుల కంపెనీ బ్రైట్కామ్గ్రూపు ప్రమోటర్లతో పాటు మరికొందరికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ.34 కోట్ల ఫైన్ వేసింది. బ్రైట్కామ్ గ్రూపు లిమిటెడ్(బీజీఎల్) ప్రమోటర్లు సురేశ్ కుమార్రెడ్డి, కంచర్ల విజయ్కు రూ.15 కోట్ల ఫైన్ పడింది. వీరిద్దరూ సెక్యూరిటీ మార్కెట్లలో లావాదేవీలు చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. డైరెక్టర్వంటి ఉన్నతస్థాయి పోస్టులు చేపట్టవద్దని సెబీ ఆదేశించింది. బీజీఎల్కు చెందిన వై.శ్రీనివాస రావుకు రూ.రెండు కోట్లు, యెర్రగొండి రమేశ్రెడ్డికి రూ.కోటి జరిమానా వేసింది.