ధూం ధాం చిత్రం నుండి రెండో పాట విడుదల

ధూం ధాం చిత్రం నుండి రెండో పాట విడుదల

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ, స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే అందిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో  మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. ఇప్పటికే ఒక పాటను రిలీజ్ చేసింది. గురువారం రెండో పాటను విడుదల చేశారు.  గోపి సుందర్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి పాడాడు. 

‘మాయా సుందరి.. హే మాయా సుందరి.. నా మాయా సుందరి.. ఎక్కడున్నావో మరి.. గుప్పెడు గుండెను నువ్వే పట్టుకుపోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..’ అంటూ సాగిన పాటలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జోడీ ఆకట్టుకుంటుంది. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో థియేట్రికల్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది.