
గోదావరిఖని, వెలుగు: తెలంగాణ పునర్విభజన చట్టం -2014లో భాగంగా నిర్మించిన రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్లోని 800 మెగావాట్ల రెండో యూనిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్పద్ధతిలో జాతికి అంకితం చేశారు. గతేడాది అక్టోబర్23న మొదటి యూనిట్ను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. అల్ట్రా సూపర్క్రిటికల్టెక్నాలజీతో ఈ యూనిట్లను నిర్మించారు. స్టేజ్1లో భాగంగా నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్లో 85 శాతం తెలంగాణ రాష్ట్ర అవసరాలకే వినియోగించనున్నారు. కాగా సోమవారం రామగుండం పర్మినెంట్టౌన్ షిప్ లోని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ పై ఈ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో మున్సిపల్కమిషనర్చింతల శ్రీనివాస్, ఎన్ బీసీ మెంబర్బాబర్సలీంపాషా, కార్పొరేటర్కొలిపాక సుజాత, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీఎంఎస్లీడర్వడ్డేపల్లి రాంచందర్, క్యాతం వెంకటరమణ, ఎన్టీపీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.