- లంగర్హౌజ్కు చెందిన యువకుడు అరెస్ట్
బషీర్ బాగ్, వెలుగు: ట్యాంక్బండ్వద్ద ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని బాంబ్తో పేల్చేస్తానంటూ మూడు రోజులుగా ఫోన్కాల్స్చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్చేశారు. సెక్రటేరియెట్ఎస్పీఎఫ్ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన సైఫాబాద్ పోలీసులు మంగళవారం లంగర్ హౌజ్కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిమ్ కార్డులు మారుస్తూ సెక్రెటేరియెట్ కు కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. దర్గాకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని, విసుగు చెంది బాంబ్బెదిరింపు కాల్స్చేసినట్లు సయ్యద్ మీర్ మహ్మద్ అలీ ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని రిమాండుకు తరలించారు.