సికింద్రాబాద్, వెలుగు: తనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు లాక్కొని, చంపుతానని బెదిరిస్తుండడంతో సహనం కోల్పోయి అతడిని హత్య చేసిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే డీఎస్పీ జావేద్, సీఐ సాయిఈశ్వర్గౌడ్కలిసి బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుజరాత్కు చెందిన నిషాద్రామ్అలియాస్ కనడ రాజు(37) బన్సీలాల్పేట్లో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్కు చెందిన సుభాష్ బహేశ్వర్ మెట్టుగూడలో ఉంటూ రైల్వే కాంట్రాక్టర్ వద్ద సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు.
నిషాద్రామ్ గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. వీరిద్దరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోపరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిషాద్రామ్ చాలా రోజులుగా సుభాష్ను బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కుని జల్సాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించి మరీ జీతం డబ్బులు లాక్కున్నాడు.
తనను ఎదుర్కొనే ధైర్యం ఉంటే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ నంబరు 10 వద్దకు రావాలని సవాల్ విసిరాడు. దీంతో నిషాద్పై పగ పెంచుకున్న సుభాష్ ఈ నెల 20న అక్కడికి వెళ్లి కర్రతో దాడి చేసి, పరారయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో నిషాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.