సికింద్రాబాద్ మెట్రోపోలిస్ హోటల్ సీజ్ చేసిన పోలీసులు : కస్టమర్లకు ఖాళీ చేయించి మరీ..

సికింద్రాబాద్ మెట్రోపోలిస్ హోటల్ సీజ్ చేసిన పోలీసులు : కస్టమర్లకు ఖాళీ చేయించి మరీ..

సికింద్రాబాద్ లోని ప్రముఖ మెట్రో పోలీస్ హోటల్ ను ఖాళీ చేయించారు పోలీసులు. హోటల్ లో ఉన్న కస్టమర్లను ఖాళీ చేయించి మరీ.. తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత సీజ్ చేశారు పోలీసులు. ప్రముఖ హోటల్ సీజ్ వెనక కారణాలు లేకపోలేదు. 

ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి.. అర్థరాత్రి సమయంలో పెకిలించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ అంశంపై మత సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులకు ఓ క్లూ దొరికింది. అమ్మవారి విగ్రహం తొలగించిన వ్యక్తి.. హోటల్ మెట్రోపోలీస్ లో బస చేసినట్లు సమాచారం వచ్చింది. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా.. విషయం తెలిసినా.. హోటల్ సిబ్బంది కనీస సమాచారం ఇవ్వకపోవటంతో.. హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు రెవెన్యూ అండ్ పోలీస్ శాఖలు. 

Also Read:-ఒక దేశం మొత్తం వాడే విద్యుత్ కంటే ఎక్కువ!

ఈ క్రమంలోనే హోటల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. హోటల్ లోని కస్టమర్లను ఖాళీ చేయించి బయటకు పంపించారు. హోటల్ సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. నిందితుడు బస చేసిన సమయంలో ఎవరితో మాట్లాడాడు.. అతను ఎవర్ని కలిశాడు.. అతన్ని కలవటానికి ఎవరైనా వచ్చారా.. హోటల్ సిబ్బందితో నిందితుడికి ఏమైనా లింక్స్ ఉన్నాయా.. ఇలాంటి సమాచారం కోసం.. హోటల్ సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. ఎన్ని రోజులు హోటల్ లో బస చేశాడు.. ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలపైనా ఆరా తీస్తున్నారు పోలీసులు.