![ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంపు](https://static.v6velugu.com/uploads/2024/06/security-increased-for-andhra-pradesh-deputy-cm-pawan-kalyan_gMi1VtZDyk.jpg)
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచారు. వై ప్లస్ సెక్యూరిటీ, ఎస్మార్ట్ వాహనంతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. మరోవైపు నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు పవన్ కల్యాణ్ . మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఃతొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన ఇద్దరు మంత్రలకు ఛాంబర్లు కేటాయించారు.