
న్యూఢిల్లీ: భోజ్ పురి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్పై దేశద్రోహం కేసు నమోదైంది. పహల్గాం టెర్రర్ అటాక్పై నేహా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదుతో లక్నో పోలీసులు ఆమెపై ఈ కేసు నమోదు చేశారు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ ‘ఎక్స్’ లో ఆమె వ్యాఖ్యలు చేశారని అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో ఆమెపై కేసు పెట్టానని ఓ వార్తా సంస్థకు అతను వెల్లడించాడు. ‘‘మతం ఆధారంగా నేహా చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజ లను మరో వర్గం వారిపై రెచ్చగొట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా జాతీయ సమగ్రతపైనా ఆమె వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపుతాయి” అని అభయ్ పేర్కొన్నాడు.