బీటెక్​ నుంచి టీచర్​ గా సెలెక్ట్..

బీటెక్​ నుంచి టీచర్​ గా సెలెక్ట్..

నారాయణపేట, వెలుగు:  డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గవినోళ్ల రఘు రామేశ్వర్​రెడ్డి   జిల్లా మొదటి ర్యాంక్​ సాధించారు.   రఘురామేశ్వర్​రెడ్డి 2012లో బీటెక్​ చేశాడు. అనంతరం  స్పెషల్​ ఎడ్యుకేషన్​లో ​ బీఈడీ చేశాడు.  హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో  ఎస్​ఓగా పని చేస్తూ పరీక్షలకు ప్రిపేర్​ అయ్యాడు.  డీఎస్సీ  లో జిల్లా ర్యాంక్​ సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు తన తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విజయం సాధించానని తెలిపారు.