
కోల్బెల్ట్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి ఉద్యోగులు, అధికారులను సింగరేణి యాజమాన్యం శనివారం ఎంపిక చేసింది. మందమర్రి ఏరియా నుంచి బెస్ట్ఆఫీసర్గా రామకృష్ణాపూర్ఓపెన్ కాస్ట్ సీనియర్సర్వే ఆఫీసర్ మన్నేపల్లి శేఖర్, ఉత్తమ ఉద్యోగిగా కాసిపేట మైన్ కోల్కట్టర్ కె.సంతోష్ను ఎంపిక చేశారు.
శ్రీరాంపూర్ ఏరియా నుంచి బెస్ట్ఆఫీసర్గా ఆర్కే–7 మైన్ డివైఎస్ఈ కోజా వెంకటరాము, ఉత్తమ ఉద్యోగిగా ఆర్కే-5 మైన్ యాక్టింట్ ఎస్డీఎల్ ఆపరేటర్ సీదిరాల మల్లారావును యాజమాన్యం ఎంపిక చేసింది. బెల్లంపల్లి ఏరియా నుంచి బెస్ట్ ఆఫీసర్గా సీనియర్ఎస్టేట్అధికారి నవనీత, ఉత్తమ ఉద్యోగిగా ఖైరిగుడా ఓసీపీలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న మేకల స్వామిని ఎంపిక చేశారు. ఆదివారం కోత్తగూడెంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ సెంట్రల్ ఫంక్షన్లో ఉత్తమ ఆఫీసర్లను సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్ సన్మానించనున్నారు. ఉత్తమ ఉద్యోగులను ఆయా ఏరియాలో పరిధిలో నిర్వహించే వేడుకల్లో జీఎంలు సన్మానిస్తారు.