స్మిత ట్వీట్లపై హీట్!..ఐఏఎస్​ వర్గాల్లో చర్చ

స్మిత ట్వీట్లపై హీట్!..ఐఏఎస్​ వర్గాల్లో చర్చ
  • ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎక్స్​లో వరుస పోస్టులు  
  • ఇప్పటికే కంచ గచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్​ ఫొటోలు రీ ట్వీట్​
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి లాంటివాళ్లు ఫేక్​ ఫొటోలు తొలగించినా స్మిత మాత్రం తగ్గట్లే
  • మార్ఫింగ్​ ఫొటో పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసుల నోటీసులు
  • తాజాగా మరో మూడు పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత​
  • 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫొటో కూడా రీపోస్ట్​
  • స్మితా సబర్వాల్​ తీరుపై ఐఏఎస్​ వర్గాల్లో చర్చ

హైదరాబాద్, వెలుగు: సీనియర్​ఐఏఎస్ ఆఫీసర్​స్మితా సబర్వాల్​తీరు ఐఏఎస్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో ఐఏఎస్​లు  భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడ్తున్నట్టు ఆమె ఇటీవల సోషల్​మీడియాలో పెడ్తున్న పోస్టులు, రీ ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూలో మార్ఫింగ్​ఫొటోను రీ ట్వీట్​చేసిన స్మితాకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా.. వాటికి ఆమె నుంచి సమాధానం రాలేదు. పైగా సర్కారు చర్యలను తప్పుపట్టేలా ఉన్న మరో రెండు మూడు పోస్టులను తాజాగా స్మితా సబర్వాల్​ రీ ట్వీట్​చేయడం హాట్​ టాపిక్​గా మారింది. 

నోటీసులు ఇచ్చినా..!

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్​ ఫొటోలు, వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేసినవారిపై సర్కారు సీరియస్​గా ఉంది. ఈ క్రమంలోనే  పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్ఫింగ్​ ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్, రీ ట్వీట్​ చేసినవారిలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి లాంటి ఒకరిద్దరు ప్రజాప్రతినిధులతో పాటు పలువురు బీఆర్​ఎస్, బీజేపీ లీడర్లు ఉన్నారు.

 అధికారుల్లో ఒక్క స్మితా సబర్వాల్​ తప్ప మిగిలిన వారెవరూ ఆ ఇష్యూ జోలికి పోలేదు.  స్మిత ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూరిజం, కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మార్చి 31న ‘హాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే ఎక్స్ హ్యాండిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మిత రీ ట్వీట్​చేశారు. అది కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్​ ఫొటో కావడంతో కలకలం రేగింది. 

మార్ఫింగ్​ ఫొటోల ఇష్యూలో పోలీసులు కేసుల నమోదు ప్రారంభించగానే.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి , ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి సహా పలువురు తమ సోషల్​మీడియా అకౌంట్ల నుంచి మార్ఫింగ్​ ఫొటోలను తొలగించారు. కానీ, ఐఏఎస్​ఆఫీసర్​ స్మితా సబర్వాల్​ మాత్రం తన ట్విటర్​ ఖాతా నుంచి మార్ఫింగ్​ ఫొటోను తొలగించలేదు. దీంతో కంచ గచ్చిబౌలి పోలీసులు ఈ నెల11న ఆమెకు నోటీసులు జారీ చేశారు. 

దీనికి నేరుగా ఎక్కడా స్పందించని స్మిత..​ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉన్న ఓ మూడు ఎక్స్​ పోస్టులను తాజాగా రీ ట్వీట్​చేశారు. ‘‘తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్​ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టులతోపాటు,  ‘‘కంచ గచ్చిబౌలి  భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలనే ప్లాన్​తో రండి. లేదంటే అధికారులు జైలుకు వెళ్లకతప్పదు’’ అన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న ‘లైవ్​లా’ పోస్ట్​ను కూడా స్మితా రీ ట్వీట్​చేయడం హాట్​టాపిక్​గా మారింది. మొదటి రెండు పోస్టుల్లో ఎప్పట్లాగే ఏఐతో క్రియేట్​ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉండడం గమనార్హం. 

మిస్​ వరల్డ్​ పోటీల బాధ్యతలు చూస్తూ..!

కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన మార్ఫిం గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినందుకు గాను ఈ నెల 11న   స్మితాకు గచ్చిబౌలి పోలీసులు బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 179 సెక్షన్ కింద నోటీసులిచ్చారు.   రీ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఫొ టోలకు సంబంధించిన సమాచారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  బుధవారమే పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె అటెండ్​ కాలేదు. కాగా, మరోసారి ఇలాంటి పోస్టులే పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ ఐఏఎస్​ వర్గాల్లో జరుగుతున్నది. 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో సీఎంవో సెక్రటరీగా స్మితా కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్​ ప్రాజెక్టులనూ పర్యవేక్షించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్​ ఆఫీసర్లంతా వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లినా స్మితా మాత్రం చాలా రోజులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వార్తలు వచ్చాయి.  ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్​ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూరిజం, కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. 

మేలో హైదరాబాద్​లో జరిగే ప్రతిష్టాత్మక మిస్​వరల్డ్​ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మితానే చూసేలా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి టైమ్​లో ఆమె వ్యవహార శైలి, సోషల్​ మీడియా పోస్టులు ఐఏఎస్​ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.