పవన్ మూడో పెళ్లిపై ప్రచారం చేస్తుందని జర్నలిస్ట్ కి బెదిరింపులు

పవన్ మూడో పెళ్లిపై ప్రచారం చేస్తుందని జర్నలిస్ట్ కి బెదిరింపులు

భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పై ప్రముఖ మహిళా జర్నలిస్ట్  బబితా మిశ్రా పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పవన్ సింగ్ తన రెండో భార్య జ్యోతిక సింగ్ కి విడాకులు ఇచ్చి త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు ఇంటర్వ్యూలలో మాట్లాడింది. దీంతో పవన్ సింగ్ అనుచరులు బబితా మిశ్రా ని హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. 

ALSO READ | కన్నడ స్టార్ హీరో దర్శన్ పై మరో కేసు..

పూర్తివివరాల్లోకి జర్నలిస్టు బబితా మిశ్రా రాత్రి 9:30 గంటల సమయంలో బహదూర్‌పూర్ ఓవర్‌బ్రిడ్జి నుండి తన డ్రైవర్ ఉమేష్ రాయ్‌తో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా, నలుగురు వ్యక్తులు హెల్మెట్లు ధరించి  రెండు బైక్‌లపై వచ్చి తమ వాహనాన్ని ఆపారు. అనంతరం తుపాకీతో బెదిరిస్తూ మరోసారి జ్యోతి సింగ్ మరియు పవన్ సింగ్ గురించి ఇంటర్వ్యూలలో లేదా సోషల్ మీడియాలో చర్చించవద్దని , “పవన్ భయ్యా చాలా కోపంగా ఉన్నాడు” అని హెచ్చరించి పరారయ్యారు. దీంతో బబితా మిశ్రా పాట్నాలోని కడమ్‌కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఈ విషయం ఇలా ఉండగా పవన్ సింగ్ తన మొదటి భార్య ప్రియాంక సింగ్ తో 2015లో విడాకులు తీసుకుని రెండో భార్య జ్యోతిసింగ్  ని 2018 లో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 4 ఏళ్ళ వరకూ వీరిద్దరూ కలసి ఉన్నారు. ఇటీవలే జ్యోతిక సింగ్ పవన్ సింగ్ తో మనస్పర్థలు, విభేధాలు రావడంతో తన పుట్టింట్లో ఉంటోంది. 

ప్రస్తుతం జ్యోతిక సింగ్ విడాకులకి సంబంధించిన ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  జ్యోతిక సింగ్ "అతను నన్ను ప్రేమిస్తే, ఎందుకు విడాకులు తీసుకుంటున్నాడు? ఎందుకు సరిగ్గా జీవించడం లేదు అని తన భర్తపట్ల జ్యోతిక తన బాధ ని వ్యక్తం చేసింది. అలాగే జనవరి నెలలో తన భర్త పవన్ సింగ్ మరొకరిని మూడో వివాహం చేసుకోబోతున్నట్లు తన బంధువుల నుంచి సమాచారం అందిందని పేర్కొంది. దీంతో పవన్ సింగ్ వ్యవహారం భోజపూరి సినిమా ఇండస్టీలో హాట్ టాపిక్ గా మారింది.