గోదావరిఖని బొగ్గు గనిలో పై కప్పు కూలి.. మైనింగ్ ​స‌ర్దార్‌కు గాయాలు

గోదావరిఖని బొగ్గు గనిలో పై కప్పు కూలి.. మైనింగ్ ​స‌ర్దార్‌కు గాయాలు
  • గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ -1 ఏరియా జీడీకే 11 ఘనిలో ఘటన 

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ –1 ఏరియా పరిధిలోని జీడీకే–11 గని పై కప్పు కూలి సీనియర్ ​మైనింగ్ ​సర్ధార్​ గాయపడ్డాడు.  గనిలోని 1వ సీమ్​లో  సీనియర్​ మైనింగ్​సర్దార్ రవితేజ పనిచేస్తుండగా పైకప్పు కూలడంతో బొగ్గు పెల్ల అతని తలపై పడింది. రవితేజ హెల్మెట్​ధరించినా పగిలిపోవడం ప్రమాద తీవ్రతను తెలుపుతుంది. గాయపడ్డ అతడిని గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్​కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్​లోని ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు.

 ఘటన శనివారం తెల్లవారుజామున జరగగా, ప్రమాద వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంతో  కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా రూప్‌న‌కు హోల్ చేయించ‌డ‌మే ప్రమాదానికి కార‌ణ‌మ‌ని తెలుస్తుంది.