
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు 2015లో జరిగిన బాలిక హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా నిర్దారించిన గుణశేఖర్ కు మరణ శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే...దేవరపల్లి గ్రామానికి చెందిన వేపాడ ధనలక్ష్మి మురుగన్ దంపతుల కుమార్తె దివ్యను గుణశేఖర్ గొంతు కోసి హత్య చేశాడు. .. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలంగా మారింది. .. చివరికి చోడవరం కోర్టు తుది తీర్పుని వెల్లడించింది.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన 31 ఏళ్ల యువకుడు శేఖర్కు మరణశిక్ష విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ తీర్పును వెలువరించారు. 10 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ తరువాత శేఖర్పై మోపిన నేరం రుజువు కావడంతో జడ్జి అతనికి మరణ శిక్ష విధించారు.
వేపాడు దివ్య కుటుంబంతో శేఖర్కు గొడవలు ఉండేవి. అవి మనసులో పెట్టుకున్న నిందితుడు శేఖర్.. వేపాడు దివ్య స్కూల్కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. అక్కడి నుంచి.. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు ఆ బాలికను తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను మాటల్లో పెట్టి.. అక్కడే ఉన్న బీర్ బాటిల్తో ఆమె గొంతును అత్యంత దారుణంగా కోసి హత్య చేశాడు.
ఈ ఘటనపై వేపాడు దివ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఈ ఘాతుకానికి పాల్పడింది శేఖర్ అని నిర్ధారించుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి.. సుదీర్ఘంగా విచారణ జరిపారు. శేఖర్పై పోలీసులు మోపిన అభియోగాలు రుజువు కావడంతో చోడవరం న్యాయస్థానం శేఖర్కు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.