![సెన్సెక్స్ 197 పాయింట్లు డౌన్.](https://static.v6velugu.com/uploads/2025/02/sensex-closed-down-by-197-points-buying-in-midcap-stocks_gD1qHf6AIT.jpg)
- 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ముంబై: ఆర్బీఐ వడ్డీరేట్ల కోత ఈక్విటీ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపకపోవడం, విదేశీ నిధులు తరలిపోవడం, ప్రాఫిక్ బుకింగ్ ఎక్కువగా ఉండటంతో సెన్సెక్స్ శుక్రవారం 197.97 పాయింట్లు నష్టపోయి 77,860.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 582.42 పాయింట్ల వరకు పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43.40 పాయింట్ల నష్టంతో 23,559.95 వద్ద సెటిలయింది. సెన్సెక్స్లో ఐటీసీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, పవర్గ్రిడ్ నష్టపోయాయి.
టాటా స్టీల్, ఎయిర్టెల్, జొమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్0.68 శాతం తగ్గగా, బీఎస్ఈ మిడ్క్యాప్ఇండెక్స్0.13 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో నష్టాల్లో షాంఘై, హాంగ్కాంగ్లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.3,549.95 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.