
ముంబై: వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎఫ్ఐఐల పెట్టుబడులు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు దూసుకెళ్లి 75,449 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 22,907 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్నుంచి టాటా స్టీల్, జొమాటో, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.
టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, మారుతి, హెచ్సీఎల్ టెక్, నెస్లే వెనకబడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 2.28 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 2.17 శాతం పెరిగాయి.