కొండాపూర్​ లో ఫుట్​పాత్​ ఆక్రమణలు తొలగింపు

కొండాపూర్​ లో ఫుట్​పాత్​ ఆక్రమణలు తొలగింపు

కొండాపూర్ శ్రీరామ్ నగర్ లో ఫుట్‌ పాత్‌ ఆక్రమణలపై శేరిలింగంపల్లి టౌన్​ ప్లానింగ్​ అధికారులు కొరడా ఝులిపించారు. ఫుట్‌పాత్‌, రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించే దిశగా  శేరిలింగంపల్లి టౌన్​ ప్లానింగ్​ అధికారులు  చొరవ చూపారు. కాలనీలో ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.  రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్​ బందోబస్తు మధ్య జేసీబీలతో తొలగించారు.

రెండు రోజుల క్రితం మున్సిపల్​ కార్యాలయంలో స్థానికులు ఆందోళన నిర్వహించారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో భారీగా ట్రాఫిక్​ జాం అవుతుంది.  దీంతో భారీ పోలీస్​ బందోబస్తు మధ్య ఫుట్​ పాత్​  జేసీబీలతో ఆక్రమణలను తొలగించారు.  రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని  శేరిలింగంపల్లి టౌన్​ ప్లానింగ్​ అధికారులు హెచ్చరించారు.