
మంచిర్యాల, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో గెస్ట్ టీచర్లు, ఫ్యాకల్టీ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సోషల్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు.
డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్స్ జరుగుతాయని తెలిపారు. ఈ నెల 28 లోపు దగ్గరలోని స్కూళ్లలో అప్లై చేసుకోవాలని సూచించారు. 30న ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు గుడిపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్రెసిడెన్షియల్ స్కూల్లో డెమో, ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వివరాలకు 7993456620 నంబర్లో సంప్రదించాలన్నారు.
డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు....
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీమ్ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఇంటర్పూర్తి చేసిన స్టూడెంట్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గోపీచంద్, మంచిర్యాల జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ తెలిపారు. ఆన్లైన్లో www.mjptbcwreis.telangana.gov.in లో అప్లై చేసుకోవాలన్నారు.