
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం సర్వీస్ లింక్డ్ ప్రమోషన్లు(ఎస్ఎల్పీ) కల్పించింది. బుధవారం మందమర్రి జీఎం ఆఫీస్లోఉద్యోగులకు జీఎం మనోహర్ ప్రమోషన్ఆర్డర్స్ అందించారు. జీఎం మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగిని సంస్థ గుర్తిస్తుందన్నారు. ఏరియా ఏస్వోటుజీఎం ఎ.రాజేశ్వర్రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డివైపీఎం సత్యబోస్, ఓఎస్ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.