మెట్రో లైబ్రరీలు .. మెట్రో స్టేషన్లలో గ్రంథాలయాల ఏర్పాటు

మెట్రో లైబ్రరీలు .. మెట్రో స్టేషన్లలో గ్రంథాలయాల ఏర్పాటు
  • వచ్చే నెలలో ‘మధురానగర్’లో ప్రారంభించనున్న సీఎం  
  • తర్వాత నాలుగు స్టేషన్లలో ఓపెనింగ్​ 
  • ఓపెన్​ లైబ్రరీస్​ పేరుతో హెచ్​పీఎస్ ​స్టూడెంట్ 
  • ఆకర్షణ వినూత్న ప్రయోగం

హైదరాబాద్ సిటీ, వెలుగు:వివిధ కార్యక్రమాలతో వినోదాన్ని అందిస్తున్న మెట్రో..త్వరలో ఓ బాలికతో కలిసి మెట్రోస్టేషన్లలో లైబ్రరీలు ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే నిమ్స్, ఇతర ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసిన హెచ్​పీఎస్​స్టూడెంట్ ఆకర్షణ సతీశ్..మెట్రోతో కలిసి ‘ఓపెన్​ లైబ్రరీస్’ పేరిట కొత్త ఆలోచనకు తెర తీసింది. 

ఇందులో భాగంగా మొదటగా వచ్చే నెలలో మధురానగర్ మెట్రో స్టేషన్​లో లైబ్రరీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీని వెంటనే భరత్ నగర్, ఉప్పల్ స్టేడియం, బేగంపేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టేషన్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని ఆకర్షణ చెప్పారు. మెల్లిగా మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ఓపెన్​లైబ్రరీలు ఏర్పాటు చేయాలనే ప్లాన్​తో ఉన్నట్టు ప్రకటించారు.  

ఓపెన్ లైబ్రరీస్ యాప్​..

మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే ఒక్కో లైబ్రరీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్​ భాషలు కలిపి మొత్తం వెయ్యి బుక్స్ అందుబాటులో ఉంచనున్నట్టు ఆకర్షణ తెలిపారు. లైబ్రరీల నిర్వహణకు ‘ఓపెన్ లైబ్రరీస్’ పేరుతో యాప్​ కూడా తీసుకురాబోతున్నామన్నారు. మెట్రో ప్రయాణికులు ఈ యాప్​లో  పేరు, ఫోన్​ నంబర్ ఎంట్రీ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏ స్టేషన్ లో, ఏ బుక్​ తీసుకుంటున్నారో ఆ యాప్ లో ఎంటర్ చేయాలి. తిరిగి ఏ స్టేషన్​లో ఉన్న లైబ్రరీలో అయినా బుక్ ను తిరిగి ఇవ్వొచ్చు.  

19 లైబ్రరీల ‘ఆకర్షణ’

హైదరాబాద్​పబ్లిక్​స్కూల్​లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ ఇప్పటికే  నిమ్స్, ఎమ్ఎన్​జే హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, గవర్నమెంట్ స్కూల్స్, పోలీస్ స్టేషన్లు, భరోసా సెంటర్లతో సహా మొత్తం19 చోట్ల లైబ్రరీలు ఏర్పాటు చేసింది. ఇందులో 13,500 బుక్స్​ను అందుబాటులో ఉంచారు.  చిన్న వయసులోనే గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ఆకర్షణను పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పీఎం మన్​కీ బాత్ లో ఆకర్షణ చేస్తున్న పనిని మోదీ ప్రస్తావించారు. రాష్ట్రపతి, సీఎం, పీఎం నుంచి ఆకర్షణ ఎన్నో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 25వ లైబ్రరీ ప్రారంభానికి పీఎం మోదీ వస్తానని హామీ ఇచ్చారని ఆకర్షణ చెప్పారు. 

1,800 పుస్తకాలతో  నిమ్స్​లో ఆకర్షణ లైబ్రరీ

పంజాగుట్ట నిమ్స్ లోని రేడియాలజీ అంకాలజీ విభాగంలో 1,800 పుస్తకాలతో హెచ్​పీఎస్​స్టూడెంట్​ఆకర్షణ ఏర్పాటు చేసిన లైబ్రరీని సిటీ సీపీ సీవీ ఆనంద్, నిమ్స్​డైరెక్టర్​డాక్టర్​బీరప్ప మంగళవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. తను చదువుతూనే అందర్నీ చదివించేలా ఆకర్షణ లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎవరైనా పుస్తకాలు డొనేట్​చేయాలనుకుంటే ఆకర్షణకు ఇవ్వాలని సూచించారు. క్యాన్సర్​పేషెంట్లకు ఉపయోగపడేలా తాను సేకరించిన, కొనుగోలు చేసిన పుస్తకాలతో నిమ్స్​లో లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపింది. కాగా ఇప్పటివరకు ఆకర్షణ సిటీలోని వేర్వేరుచోట్ల 18 లైబ్రరీలు ఏర్పాటు చేసింది. ఇది 19వ లైబ్రరీ. కార్యక్రమంలో రేడియేషన్​ అంకాలజీ విభాగం హెడ్ డాక్టర్ మోనిక, డాక్టర్లు పాల్గొన్నారు. 

జర్నీలో టైమ్ వేస్ట్  చేయకుండా..

మెట్రో ప్రయాణం సందర్భంగా చాలామంది ప్యాసింజర్స్​ను అబ్జర్వ్​చేశా. దాదాపు అందరూ రీల్స్, సినిమాలు చూస్తూనే కనిపించారు. అందుకే వారి టైం వేస్ట కాకుండా, నాలెడ్జ్​ ఇంప్రూవ్​అయ్యేలా బుక్స్​ చదివించాలని అనుకున్నా. మెట్రో లైబ్రరీల్లో అన్ని వర్గాల వారికి బుక్స్​అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల దగ్గర ఓల్డ్ బుక్స్ ఏమైనా ఉంటే డొనేట్ చేయొచ్చు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన లైబ్రరీలకు మా నాన్న సతీశ్​తో పాటు సీనియర్​లైబ్రేరియన్​ప్రఫుల్ చంద్ర, జి.చంద్రశేఖర్ రావు ఎంతో కోపరేట్​చేశారు.