బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బీర్‌భూమ్‌ జిల్లాలోని ఓ బొగ్గు గని భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు అందించడానికి బయలుదేరారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

బీర్‌భూమ్‌లోని లోక్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న గంగారామ్‌చక్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ కొలీరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ప్రభావానికి సమీపంలో పార్క్‌ చేసిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొలీరీలో బొగ్గు వెలికితీత కోసం పేలుడు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. గనిలో పేలుడు తర్వాత అధికారులు, కార్మికులు సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు.

ALSO READ | రాజకీయం చేయకండి.. ఓవర్ హీట్ కారణంగా చనిపోయారు : మంత్రి మా సుబ్రమణియన్