హిమాచల్​​లో తుపాన్ చెట్టుకూలి ఆరుగురు మృతి

హిమాచల్​​లో తుపాన్ చెట్టుకూలి ఆరుగురు మృతి

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్​ను భారీ తుపాన్​కుదిపేస్తున్నది. ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీయడంతో ఓ పర్యాటక ప్రాంతంలో చెట్టు కూలగా.. ఆరుగురికిపైగా మృతిచెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మణికరణ్ గురుద్వారా ముందు రోడ్డు సమీపంలో ఉన్న  చెట్టు తుపాన్​ కారణంగా దుకాణాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. 

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. పెద్ద చెట్టు కూలడంతో దానికింద  దుకాణాలు, కార్లు నుజ్జునుజ్జయిపోయాయి. ‘మా అమ్మ, వాళ్లు చనిపోయారు’ అంటూ ఓ వ్యక్తి ఏడుస్తూ చెప్పడం అందరినీ కలిచివేసింది. కాగా, హిమాచల్​ప్రదేశ్​లోని చంబా, కాంగ్రా, కుల్లు, మండి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​ జారీ చేసింది.