
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah rukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. దీపికా పదుకొనె(Deepika padukone), నయనతార(Nayanatara), విజయ్ సేతుపతి(Vijay sethupathi) వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
#WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv
— ANI (@ANI) September 5, 2023
ఇదిలా ఉండగా అతిత్వరలో జవాన్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్, హీరోయిన్ నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్ ఖాన్కు స్వాగతం పలికారు. తిరుమల దేవస్థాన సంప్రదాయ ప్రకారం షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్, నయనతార, విగ్నేష్ శివన్ అందరూ తెల్లటి దుస్తుల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.