
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్అపాయింట్మెంట్స్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని, ఆయన పదవీకాలం ప్రధాని టర్మ్ ముగిసేవరకు లేదా తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా ఉన్నారు. ఇప్పుడు రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఇటీవలే ఆర్బీఐ గరవ్నర్గా ఆయన రిటైర్ అయ్యారు. కాగా, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.