దసరా మామూళ్లు డిమాండ్​ .. ఐదుగురు రిపోర్టర్లు అరెస్ట్

దసరా మామూళ్లు డిమాండ్​ .. ఐదుగురు రిపోర్టర్లు అరెస్ట్
  • నిందితులంతా డిజిటల్ ​న్యూస్ ​పేపర్ల​ విలేకరులు 

చేవెళ్ల, వెలుగు: దసరా పండుగకు మామూళ్లు ఇవ్వాలని ఓ దవాఖాన యాజమాన్యాన్ని బెదిరించిన ఐదుగురు విలేకరులపై శంకర్​పల్లి పోలీస్​ స్టేషన్​లో  కేసు నమోదైంది. రాజేశ్ గౌడ్ , సాయికిరణ్ రెడ్డి, ప్రతాప్, సుధాకర్ గౌడ్, మల్లేశ్​గౌడ్ అనే ఐదుగురు శంకరపల్లి మండలంలో కొన్ని డిజిటల్​పేపర్లకు రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 8న శంకర్​పల్లి హైదరాబాద్ రోడ్డులోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లారు.

దసరా పండుగకు రూ.10 వేలు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే దవాఖానపై నెగటివ్ వార్తలు రాస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో వారు బుధవారం పీఎస్​లో ఫిర్యాదు చేయగా ఐదుగురిపై చేవెళ్ల సీఐ శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేశారు.