
- విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిల పట్టివేత
గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతంలో టెన్త్ ఎగ్జామ్ సెంటర్ల వద్ద గత 10 రోజులుగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి విద్యార్ధినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 10 బైక్లు స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మరో 9 మంది మైనర్లకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే డయల్ 100కు గానీ, రామగుండం షీ టీం నెంబర్ 6303923700 నంబర్కు గానీ సమాచారమివ్వాలని సూచించారు.