Bigg Boss Telugu 8: బిగ్ ట్విస్ట్: శేఖ‌ర్ బాషా ఇలా మధ్యలోనే ఎలిమినేట్..కారణం ఇదేనా?

Bigg Boss Telugu 8: బిగ్ ట్విస్ట్: శేఖ‌ర్ బాషా ఇలా మధ్యలోనే ఎలిమినేట్..కారణం ఇదేనా?

బిగ్ బాస్ మొదటివారం ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. దీంతో రెండోవారం ఎలిమినేషన్స్ లో శేఖ‌ర్ బాషా (Shekar Basha) ఎలిమినేట్ అయ్యాడు.

ఎలిమినేష‌న్ విష‌యంలో శేఖ‌ర్ బాషాకు అన్యాయం జ‌రిగింద‌ని ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తోన్నారు.అంతేకాకుండా హౌస్ లో కాస్తో కూస్తో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది శేఖర్ బాషానే..అలాంటిది అతన్ని పంపించడంతో బిగ్ బాస్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

తాజా విషయానికి వస్తే..హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన శేఖ‌ర్ బాషా జెన్యూన్ కంటెస్టెంట్స్‌గా కిరాక్ సీత‌, విష్ణుప్రియ‌, ప్రేర‌ణ పేర్లు చెప్పాడు. ఫేక్ కంటెస్టెంట్స్‌గా మ‌ణికంఠ‌, సోనియా, ఆదిత్య ఓం లను పేర్కొన్నాడు. అయితే శేఖర్ బాషా కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి.

శనివారం (సెప్టెంబర్ 14న) జరిగిన ఎపిసోడ్ లో శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడని నాగార్జున చెప్పడంతో అతను ఎమోషనల్ అయ్యాడు. మూడు రోజుల క్రితమే శేఖర్ బాషాకి కొడుకు పుట్టాడు. ఈ విషయం తెలియడంతో శేఖర్ బాషానే బయటకి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. తన భార్య, కొడుకుని చూడాలని, ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉండాలని..శేఖర్ బాషా అనుకోని తనే స్వయంగా వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకోవడంతో..దీంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యేట్టు బిగ్ బాస్ ప్లాన్ చేసిందని పలువురు భావిస్తున్నారు.

ఈ వార్తలపై శేఖర్ బాషా స్పందిస్తూ.. నేనే కావాలని బయటకి వచ్చేసాను. బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూడటానికే నేను అడిగి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. నేను ఇంకా ముందుకు వెళ్తాను అని నమ్మి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాన్నాని బాషా తెలిపారు.

కంటెస్టెంట్స్ నిర్ణ‌యంతో శేఖ‌ర్ బాషా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ కానుండ‌టంతో కిరాక్ సీత ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్న‌ది. ఆదిత్య ఓం, న‌బీల్ క‌లిసి శేఖ‌ర్‌ను త‌మ భుజాల‌పై ఎత్తుకొని సెండాఫ్ ఇచ్చారు. కిరాక్ సీత‌ను నిఖిల్ ఓదార్చాడు.

శేఖ‌ర్ బాషా ఎలిమినేట్‌ వివరాలు:

ముగ్గురు ఫేక్ కంటెస్టెంట్స్‌, ముగ్గురు రియ‌ల్ కంటెస్టెంట్స్ ఎవ‌రో చెప్పాల‌ని నాగార్జున, శేఖ‌ర్ బాషాకు  టాస్క్ ఇచ్చాడు. ఇందులో రియ‌ల్ కంటెస్టెంట్‌గా సీత‌, విష్ణుప్రియ‌, ప్రేర‌ణ‌ల‌ను అని తెలిపాడు. ఇందులో కిరాక్ సీతతో మాట్లాడితే చెల్లితో మాట్లాడిన‌ట్లు ఉంటుంద‌ని అన్నాడు. విష్ణుప్రియ ఇన్నోసెంట్ అని శేఖ‌ర్ బాషా చెప్పాడు. ప్రేర‌ణ‌ను జెన్యూన్‌, ఎన‌ర్జిటిక్‌గా అని చెప్పారు. 

ఇకపోతే ఫేక్ కంటెస్టెంట్స్‌గా సోనియా, మ‌ణికంఠ‌, ఆదిత్య ఓం ల‌నుపేర్కొన్నాడు. సోనియా న‌వ్వు చూసి తొలుత ప్ర‌శాంతంగా ఫీల‌య్యాన‌ని, కానీ నామినేష‌న్స్‌లో మ‌హంకాళి అవ‌తారం చూశాన‌ని అన్నాడు. మ‌ణికంఠ కావాల‌నే ఎప్పుడు ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడ‌ని, ప్ర‌తిదానికి లెక్క‌లు వేసుకుంటాడ‌ని శేఖ‌ర్ బాషా చెప్పాడు.

ఆదిత్య ఓం త‌న‌ను మూడుసార్లు నామినేట్ చేస్తే స్పోర్టివ్‌గా తీసుకున్నాన‌ని, కానీ తాను ఒక్క‌సారి ఆదిత్య‌ను నామినేట్ చేస్తే అత‌డు త‌ట్టుకోలేక‌పోయాడ‌ని శేఖ‌ర్ బాషా అన్నాడు

ఆర్జేగా ఒకప్పుడు పాపులర్. షోలోకి రాకముందు రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో ఎంటరై కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే హౌసులోనూ కామెడీ చేసే బాధ్యతలు తీసుకున్నాడు.