శిల్పా శెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై బాంబే కోర్టు స్టే

శిల్పా శెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై బాంబే కోర్టు స్టే

ముంబై: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట దక్కింది. పుణెలోని పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్ హౌస్, ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇంటిని ఖాళీచేయాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 

కాగా, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తమ ఆస్తులను ఖాళీ చేయాలని ఈడీ సెప్టెంబర్ 27న నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో రాజ్ కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల విలువైన స్థిర చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. బిట్ కాయిన్ రూపంలో రాజ్ కుంద్రా సంస్థ రూ. 6,600 కోట్లు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు పది శాతం రిటర్న్స్ ఇస్తామని ఇన్వెస్టర్లను నమ్మించి మోసం చేసినట్లు కేసు నమోదు అయింది.