మనీలాండరింగ్ కేసులో కోర్టుని ఆశ్రయించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు.

మనీలాండరింగ్ కేసులో కోర్టుని ఆశ్రయించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు.

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలోని  శిల్పాశెట్టి దంపతులకి చెందిన నివాస స్థలాలు మరియు ఫామ్‌హౌస్‌ను తాత్కాలికంగా అటాచ్ చేయడంతో ఖాళీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వారికి నోటీసు పంపింది.

దీంతో ఈ అంశంపై గురువారం, అక్టోబర్ 10న విచారణ జరగనుంది. ఈ క్రమంలో నటి శిల్పాశెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాకు పంపిన నోటీసులపై చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు బుధవారం ఈడీ ని ఆదేశించింది.

ALSO READ | గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు

అయితే ఈ ఏడాది ప్రారంభంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం రిపు సుదన్ కుంద్రా,  అకా రాజ్ కుంద్రాకు చెందిన 97.79 కోట్లు విలువైన ఆస్తులను ముంబై జోనల్ ఆఫీస్ అటాచ్ చేసింది. దీంతో సెప్టెంబర్ 27న శిల్పాశెట్టి దంపతులకు తమ ఆస్తులను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు.

గతంలో బిట్‌కాయిన్‌ల రూపంలో నెలకు 10 శాతం రిటర్న్ ఇస్తామని ప్రజల నుంచి బిట్‌కాయిన్‌ల రూపంలో (2017లోనే రూ. 6,600 కోట్లు) భారీ మొత్తంలో నిధులు సేకరించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను బిట్‌కాయిన్ పోంజీ స్కామ్‌కు సంబంధించిన మాస్టర్ మైండ్ మరియు ప్రమోటర్ అమిత్ భరద్వాజ్ నుండి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.