అలరించిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యాలు

అలరించిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యాలు

శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  హంపి థియేటర్​లో ఒడిస్సీ, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఒడిస్సీ గురువు డాక్టర్ ​మనసి పాండ్య రఘునందన్​తన శిష్యురాలు సంహితతో కలిసి ఒడిస్సీ నృత్యం ప్రదర్శించి మెప్పించారు.  అనంతరం వైదేహి సుభాష్​ శిష్య బృందం తమ భరతనాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. - వెలుగు, మాదాపూర్