పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..

పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..

కాకినాడ నుంచి షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేశారు కేటుగాళ్లు. అర్థరాత్రి అంతా గాడ నిద్రలో ఉన్న సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సామాగ్రీని ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ నుంచి షిరిడి సాయి నగర్ వెళ్తున్న ట్రైన్ అర్థరాత్రి 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ట్రైన్ లోని బీ3 బీ4 బీ5 ఏసీ కోచ్ లలోని ప్రయాణికులు గాడమైన నిద్రలో ఉన్నారు.

 ఇదే అదునుగా అనుకున్న దొంగలు.. ట్రైన్ కోచ్ ను ఖాళీ చేశారు. సుమారు 30 మంది వద్ద లగేజీ బ్యాగ్ లు, మనీ పర్సులు, మొబైల్ ఫొన్లు ఎత్తుకెళ్లారు. ఇంకేముంది నిద్రలేచి చూస్తే తమ వస్తువులు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు ప్రయాణికులు. వెంటనే సికింద్రాబాద్ స్టేషన్ లోని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సుమారు 30 మంది నుంచి రూ. 30 లక్షలు చోరీ అయినట్టు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.