
వికారాబాద్జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్గ్రామంలో నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసులో ఊహించని ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా శిరీష తండ్రి జంగయ్యే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. అల్లుడు అనిల్ తో కలిసి హత్యకు ప్లాన్ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శిరీషను అనిల్ కొడుతుంటే తండ్రిగా నువ్వేం చేశావంటూ మహిళలు ప్రశ్నించారు. దీంతో శిరీష ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల జోక్యంతో గ్రామస్థులు చల్లబడ్డారు.
జూన్ 11న శిరీష మృత దేహం స్థానికంగా ఉన్న కుంటలో కనిపించడం ముందు రోజు బావ ఆమెను కొట్టడంతో పోలీసులు అనిల్, తండ్రిపై కేసు నమోదు చేశారు. యువతి చేయి, కళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు. మరో వైపు శిరీష మృతదేహానికి వైద్యులు పరీక్షలు నిర్వహించడానికి పరిగి నుంచి డాక్టర్ వైష్ణవి వచ్చారు. నీటికుంటలో పడినప్పుడు ఆమె కళ్లకు రాళ్లు గుచ్చుకుని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడి చేశారా, హత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్కీలకంగా మారింది.